మహారాష్ట్ర వరకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు - V2News

Latest News

V2News

Monday, June 15, 2020

మహారాష్ట్ర వరకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

V2NEWS DESK :నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.