టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత - V2News

Latest News

V2News

Monday, September 14, 2020

టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత

దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని TRS ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు . దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది.దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కింది.జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004 , 2008 లో దొమ్మాట నుంచి , 2009 , 2014 , 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు . 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు . 2018 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు .2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ముత్యంరెడ్డి గత ఏడాది సెప్టెంబర్ లో అనారోగ్యంతో మరణించారు . 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు.సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ , మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉంది . మంత్రి హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యారు . కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కుల పంపిణీ , చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు . పార్టీ కేడర్ చెక్కు చెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తుల బుజ్జగింపు , ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు . ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు .