-సొంత ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకూ ఉపాధి..!
-వారికి వర్షాకాలంలో పని కల్పించేలా చర్యలు.
- ఉపాధీ హామీ పథకాన్ని మరింత విస్తరించే విధంగా కేంద్రం ప్రణాళికలు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్
V2డెస్క్ : ఆర్థిక ప్యాకేజీలో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
-దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో సహా సొంత ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకూ ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు.
ప్రకటనలో కీలక అంశాలు
- బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 61,000 కోట్లకు అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయింపు.
- అదనపు నిధులతో సుమారు 300 కోట్ల వ్యక్తిగత పనిదినాలను కల్పించేందుకు వీలు.
-లాక్డౌన్తో సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కూలీలకు వర్షాకాలంలో పని కల్పించేలా చర్యలు.
-ఉత్పత్తి పెంచటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం.
