ఖమ్మం బస్టాండ్ ను ఆకస్మిక తనీఖి చేసిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ - V2News

Latest News

V2News

Wednesday, May 20, 2020

ఖమ్మం బస్టాండ్ ను ఆకస్మిక తనీఖి చేసిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ


                             ఖమ్మం బస్టాండ్ ను ఆకస్మిక తనీఖి చేసిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ
ఖమ్మం: ఖమ్మం బస్ స్టాండ్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా బస్సుల వివరాలు ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలను ఆర్ యమ్  కృష్ణమూర్తి ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్ కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని, బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసినాకే టికెట్ ఇవ్వాలని అన్నారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం మంత్రి పువ్వాడ కోదాడ డిపో బస్సు ఎక్కారు. మీ శానిటైజర్ ఏది అని కండక్టర్ ను అడుగగా ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. ఆగ్రహించిన మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్ యమ్ తో ఫోన్లో మాట్లాడారు. కండక్టర్ కు శానిటైజర్ ఇవ్వని కోదాడ డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని అన్ని బస్సులకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అతిక్రమించి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్ స్ప్రే చేశారు.వారి వెంట నగర మేయర్ పాపాలాల్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి ఆర్టీసి సిబ్బంది ఉన్నారు.