పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వచ్చేసిన వాహనాలు!
హైదరాబాద్ : దాదాపు 60 రోజుల లాక్ డౌన్ తరువాత నారాయణఖేడ్ లో తిరిగి మామూలు స్థాయికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి.వందల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని కూడళ్ల వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది.
ఇక నారాయణఖేడ్ ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్. మరియు ఖేడ్. పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని, మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని,ఉదయం 7.గంటలనుండి సాయంత్రం 6.గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్ వెల్లడించారు.
హైదరాబాద్ : దాదాపు 60 రోజుల లాక్ డౌన్ తరువాత నారాయణఖేడ్ లో తిరిగి మామూలు స్థాయికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి.వందల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని కూడళ్ల వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది.
ఇక నారాయణఖేడ్ ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్. మరియు ఖేడ్. పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని, మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని,ఉదయం 7.గంటలనుండి సాయంత్రం 6.గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్ వెల్లడించారు.