ఆ అధికారం మీకెక్కడిది?
రుజువైతే విచారణకు ఆదేశిస్తాం
ఉన్నతాధికారులకు హైకోర్టు హెచ్చరిక
ఉపాధి బకాయిలు చెల్లించకపోవడంపై విస్మయం
ఏదైనా పని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రేస్నిచిన హైకోర్టు ఉపాధి హామీ పథకం నిధులు ఇతర అవసరాలకు మళ్లించినట్లు తేలితే ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించిన హైకోర్ట్ ..
చేసిన పనులకు బకాయిలు చెల్లించకుండా నిధుల్ని ఇతరాలకు మళ్లించడం పట్ల విస్మయం వ్యక్తం చేసిన హైకోర్ట్
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్ట్
తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసిన హైకోర్ట్
జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కె.సురేశ్రెడ్డిలు విచారణ చేసిన ధర్మాసనం
2018-19 సంవత్సరానికిగాను ఉపాధి పథకం కింద నిర్వహించిన పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను తమకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోందని పేర్కొంటూ హైకోర్ట్ ను ఆశ్రయించిన గుంటూరు జిల్లా అంగలకుదురు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వి.భవానీ తదితరులు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి
తాజాగా నిర్వహించిన పనులకు బిల్లుల చెల్లింపు కోసం మెమో జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చాన పిటిషన్
తొలిగా 2018-19 బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని నిర్దేశించాలని కోరిన పిటిషనర్
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్ట్ ధర్మాసనం